అగ్రీగోల్డ్ యజమానులకు 14రోజుల రిమాండ్..
సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి ఆ సంస్ధ యజమానులకు 14 రోజుల రిమాండ్ విధించారు. గురువారం రాత్రి అరెస్టయిన అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండీ అవ్వా వెంకట శేషు నారాయణవులను శుక్రవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు తీసు కొచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు వీరిని స్థానిక పోలీస్ గెస్ట్హౌస్కు తీసుకువచ్చారు. తర్వాత ఉదయం 10 గంటలకు జిల్లా న్యాయమూర్తు ల క్వార్టర్స్ కి తరలించారు. అక్కడ రెండో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజి స్ట్రేట్ హరి నాథ శర్మ ఎదుట హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులిద్దరినీ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఏలూరు సబ్ జైలుకు తరలించారు. కేసు విచారణ నిమిత్తం నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయ త్నిస్తున్నారు. అగ్రిగోల్డ్ యజమానులను ఆస్పత్రికి తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. అయితే బాధితులు ఎవరూ భయపడొద్దని ఈ సందర్భంగా కంపెనీ ఛైర్మన్ వెంకట రామారావు తెలిపారు. అందరికీ న్యాయం చేస్తానని తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.