ఆధార్ కు చట్టం అండ కల్పిస్తాం: అరుణ్ జైట్లీ
ఆధార్ కు చట్టం అండ కల్పిస్తామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. సోమవారం ఆయన పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆధార్ చట్టబద్ధత కోసం బిల్లును ప్రవేశపెడతామన్నారు. అర్హులు అందరూ లబ్ది పొందేలా.. సర్కారు ఇచ్చే రాయితీలు సక్రమంగా బట్వాడా జరిగేందుకు వీలుగా ఆధార్ కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. అయితే ఆధార్ అమలు నేపథ్యంలో సుప్రీంకోర్టులో చాలా వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆధార్ వినియోగాన్ని మరింతగా విస్తరించేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపబోతోంది. నేషనల్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బిల్లు రాజ్యసభలో చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. ఇప్పుడు కొత్తగా ఆధార్ (ప్రయోజనాలు, రాయితీలు, సేవల బట్వాడా) బిల్లు 2016 పేరుతో పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిని ద్రవ్య బిల్లులా ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.