మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి.. 50 మందికి గాయాలు..
మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి వెస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో ప్రమాదం జరిగింది. 70 మందితో వెళ్తున్న మినీ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ లారీ ఓ చర్చి సమీపంలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు.మరో 50 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మృతుల్లో తొమ్మిది మంది మహిళలున్నట్లుగా అధికారులు ధృవీకరించారు. గాయపడ్డ ట్రక్కు డ్రైవర్, హెల్పర్ తో పాటు మిగిలిన వారిని కూడా చికిత్స నిమిత్తం షిల్లాంగ్ ఆస్పత్రికి తరలించారు. కొంతమందిని సమీప ఆస్పత్రులకు కూడా తరలించారు. ఇక స్థానికులు, అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.