ఎస్పీ బాధ్యతలు నేతాజీకి అప్పగించాలి.. అపర్ణాయాదవ్ డిమాండ్..
యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్ పార్టీ బాధ్యతలను తండ్రి ములాయంసింగ్ కు అప్పగించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు ఈ డిమాండ్ వినిపిస్తున్నారు. వీరి జాబితాలోకి ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ కూడా వచ్చి చేరారు.ఈ మేరకు ఆమె గురువారం ఆమె మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అఖిలేశ్ యాదవ్ పార్టీ బాధ్యతలను నేతాజీకి అప్పగిస్తానని చెప్పారని అన్నారు. ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని భావిస్తున్నామన్నారు.
తన గురించి మొత్తం ఫ్యామిలీకి అందరికి తెలుసు అని అన్నారు. నేతాజీ తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయం అవుతుందని అన్నారు. ఇందులో వేరే ఆలోచించనని చెప్పారు. ఆయన పట్ల అందరూ వ్యవహరించిన తీరు సబబుగా లేదని అన్నారు.అయితే ఫ్యూచర్ లో ఏం జరగబోతోందో తెలియదని అన్నారు.తన కుటుంబం ఎప్పుడూ కలిసే ఉండాలి అని కోరుకుంటానని అన్నారు.లఖ్నవూ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి తాను ఓడిపోవడానికి తమ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలే కారణమని అపర్ణయాదవ్ ఆరోపించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.