మరోసారి చంద్రబాబుపై రోజా సంచలన వ్యాఖ్యలు..
వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి చంద్రబాబు నంద్యాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. రేపటి నుంచి చంద్రబాబు కుట్రలు, హత్యా రాజకీయాలు ప్రారంభం అవుతాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గజినీ లాంటి వారని ఆయనకు ఇచ్చిన హామీలు గుర్తుకు ఉండవని విమర్శించారు. బాబు మైనార్టీలను మోసం చేయాలనని చూస్తున్నారని ఆరోపించారు. అయితే నంద్యాల ప్రజలు డబ్బుకు అమ్ముడుపోరని అన్నారు. ఇక్కడి ప్రజలు వైసీపీనే ఆదరిస్తారని అన్నారు.
రేపటి నుంచి నంద్యాలలో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే అక్కడ జగన్ మకాం వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నంద్యాల పాలిటిక్స్ మరింత హాట్ హాట్ గా మారనున్నాయి. ఓ పక్క జగన్ మరో పక్క చంద్రబాబు ప్రచారాలతో నంద్యాల నియోజకవర్గం హోరెత్తనుంది. జగన్, రోజాలు తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు ఎలాంటి కౌంటర్ ఇస్తారోనని రాజకీయ వర్గల్లో చర్చించుకుంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.