ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరైన దినకరన్
తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే శశికళ వర్గం తరపున దినకరన్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్టీ రెండాకుల గుర్తుకోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు ఎన్నికల అధికారికి రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం అందరికి తెలిసిందే.
దీంతో ఆయనకు ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని పోలీసులు నుంచి సమన్లు అందాయి.ఈ నేపథ్యంలో ఆయన శనివారం చెన్నై నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు. తర్వాత ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మధ్యవర్తి సుఖేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయనను పోలీసులు పలు ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరే ముందు ఎయిర్ పోర్టు దగ్గర మీడియాతో మాట్లాడలేదు.తాను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడుతానని తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.