అజిత్-శంకర్ కథా చర్చలు జరగనే లేదట..!
అజిత్ కి తమిళనాట ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన చిత్ర విశేషాలపై అభిమానులు ఎప్పటికప్పుడు ఉత్కంఠగా ఎదురుచూస్తూంటారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ వివేగం సూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఆయన నెక్ట్స్ మూవీపై పడింది. అయితే ఇటీవలి కాలంలో అజిత్ , శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తారని ప్రచారం సాగింది.
ప్రెజెంట్ శంకర్.. రజినికాంత్ హీరోగా 2.0 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన అజిత్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇద్దరి మధ్యా కథా చర్చలు జరిగాయని ప్రచారం సాగుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే అది తప్పకుండా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అనడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. అయితే ఇదంతా ప్రచారం మాత్రమేననీ తెలుస్తోంది. అసలు వీరిద్దరి మధ్యా ఎలాంటి కథా చర్చలు జరగలేదనేది సమాచారం. సో వీరి కాంబినేషన్ లో సినిమా లేదనే చెప్పుకోవాల్సి ఉంటుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.