నారా లోకేశ్ ను సీఎం చేసేందుకు తాంత్రిక పూజలు
సీఎం చంద్రబాబు తన తనయుడు లోకేశ్ ను సీఎం ను చేసేందుకు తెగ కష్టపడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దీనికోసం ఆయన తాంత్రిక పూజలు కూడా చేయిస్తున్నారని ఆరోపించారు. విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన విజయవాడలో వైసీపీ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం వెనుక చంద్రబాబు ఉన్నారని అన్నారు. పూజలు చేసిన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత తప్పును అధికారుల మీదకు నెట్టేస్తున్నారని ఆరోపించారు.
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరగలేదని అన్నారు. దీనికోసం చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. కాని ఆయన కుటుంబం మాత్రం వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారని అన్నారు. అలాగే మద్యం దుకాణాలను విచ్చలవిడిగా ఒపెన్ చేసి పెట్టారని మండిపడ్డారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.