పేదలకు ఆర్ధిక సాయం అందించిన ఏపీ సీఎం చంద్రబాబు..
వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న పలువురికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ధిక సాయం అందించారు.విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడారు.వారి బాధలు విన్న సీఎం.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
గుంటూరుకు చెందిన మహేశ్వర్ రెడ్డికి 3 లక్షలు..బ్రెయిన్ ఫీవర్ ఉన్న విద్యార్ధికి 3 లక్షలు.. క్యాన్సర్ రోగికి 2 లక్షలు..కడప జిల్లాకు చెందిన మహిళ బి.లక్ష్మీ దేవికి 20 వేలు.. చిత్తూరుకు చెందిన దొరస్వామికి 2 లక్షలు.. ప్రకాశం జిల్లాకు చెందిన వెలుగొండయ్యకు 30 వేలు .. ప్రకాశం జిల్లాకు చెందిన బాలిక మున్నీసా ఆపరేషన్ కు 25 వేలు ఆర్ధిక సాయం అందించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.