మెంఫిస్, అమెరికా నవంబర్ 21:
హ్యూస్టన్ నగరానికి చెందిన అంతర్జాతీయ గాయని, ‘గాయక శిరోమణి’ మణిశాస్త్రి నిర్మాతగా, హైదరాబాద్ కు చెందిన ‘మధుర గాయక’ అంజనీ కృష్ణప్రసాద్ సంగీత దర్శకత్వం వహించి రూపొందించిన “అన్ని సింగారాలు నీకే” అన్నమయ్య కీర్తనలు CD ని , విశ్వ విఖ్యాత ఆధ్యాత్మికవేత్త విశ్వయోగి “విశ్వంజీ” టెన్నసీ రాష్ట్రంలోని మెంఫిస్ నగరం లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్క రించారు . ఈ సంధర్భంగా స్వామీజీ ప్రసంగిస్తూ ఇంతవరకు ప్రాచుర్యం పొందని అన్నమయ్య కీర్తనలు మణిశాస్త్రి, అంజనీ కృష్ణప్రసాద్ లు గానం చేసి రూపొందించటం అభినందనీయం అన్నారు. ఈ అన్నమయ్య కీర్తనలు అద్భుతంగా ఉన్నాయని, అందరు వినదగ్గవని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వేగేశ్న ఫౌండేషన్, హైదరాబాద్ మేనే జింగ్ ట్రస్టీ శిరోమణి వంశీ రామరాజు , అంజనీ కృష్ణప్రసాద్ , నాష్విల్ తెలుగు సంఘం అధ్యక్షురాలు “సేవాశిరోమణి” శ్రీమతి రేవతి మెట్టుకూరు, ఘంటసాల గాయకులు బాలకామేశ్వరరావు తాతా మరియు పలువురు పురప్రముఖులు పాల్గొన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.