ప్రివిలేజ్ కమిటీ నివేదికపై రేపు అసెంబ్లీలో నిర్ణయం..?
ఏపీ బడ్జెట్ సెషన్స్ తిరిగి సోమవారం ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక సభలో గవర్నర్ ప్రసంగంపై ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. బడ్జెట్ పై సభలో చర్చ కొనసాగనుంది. ఇక రోజా సస్పెన్షన్ పై ప్రివిలేజ్ కమిటీ సభకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.
ఏపీ అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదికపై రేపు చర్చజరిగే అవకాశం ఉంది. రోజాపై రేపు సభలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. గురువారం ప్రివిలేజ్ కమిటీ శాసనసభకు నివేదికను సమర్పించింది. అలాగే రోజా బేషరతుగా క్షమాపణ చెప్పలేదని అందులో పేర్కొంది. ఆమెపై నిర్ణయం తీసుకునే విషయాన్ని సభకు వదిలిపెట్టింది. రోజా అంశంపై రేపు స్పీకర్ కోడెల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.