సిట్ అధికారుల ముందు హాజరైన ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు
విశాఖ ల్యాండ్ స్కామ్ లో భూ రికార్డులు జరిగాయి. దీనిపై విచారణ జరిపేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ ముందు ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. గతంలో తాను బహిరంగంగా ఆరోపించిన విషయాలనే లిఖిత పూర్వకంగా సిట్ కు అందించానని చెప్పారు.ప్రభుత్వ భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ. 190 కోట్లకు పైగా రుణాలను పొందారని, ఇది దారుణమైన వ్యవహారమని ఆరోపించారు.
ప్రభుత్వ భూములను కాజేశారని అన్నారు. అలాగే రికార్డులు తారుమారు చేసి, అవన్నీ తమవేనని నమ్మించారని కోట్ల రూపాయల రుణాన్ని పొందారని చెప్పారు. పెదగంట్యాడలో మట్టెక్ పార్క్ కోసం ఈ దందా నడిచిందని పేర్కొంటూ తన దగ్గర ఉన్న వివరాలను సిట్ అధికారులకు ఇచ్చారు. రెండేళ్ల క్రితమే తాను మంత్రి హోదాలో రుణాలు ఆపాలని లేఖ రాశానని చెప్పారు. అయినా ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. మరో నాలుగైదు రోజులలో మరిన్ని ఆధారాలను అందజేస్తానని అధికారులకు వివరించానని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.