విపక్ష నేతపై మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు ఫైర్
ఏపీ అసెంబ్లీలో విపక్ష వైసీపీ సభ్యులు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఆరోపణలు చేశారు. అయితే వారి వ్యాఖ్యలను ప్రత్తిపాటి సభలోనే ఖండించారు.మరోసారి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత బడ్జెట్ సెషన్స్ లో కూడా జగన్ తనపై ఇలాగే మాట్లాడారని అన్నారు. అయితే అవి తప్పని చెప్పానని అన్నారు. అంతేకాకుండా తాను ఆధారాలు కూడా చూపించానని తెలిపారు. తాము ఆ భూములపై 2014లోనే ఒప్పందం చేసుకున్నామని అన్నారు. అప్పటికి అగ్రిగోల్డ్పై కేసు లేనే లేదని అన్నారు.
అగ్రిగోల్డ్కి, తమ భూమికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై సభలో చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆయన సవాలు చేసినట్లుగా తెలిపారు. ఆరోపణలపై సభా సంఘం వేయమన్నానని అన్నారు. ప్రభుత్వం న్యాయ విచారణకు కూడా ఒప్పుకుందన్నారు. అయితే, తన సవాలు స్వీకరించేందుకు వైసీపీ ముందుకు రాలేదన్నారు. రుజువు చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాలు చేస్తే జగన్ సభకు రాకుండా పారిపోయాడని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.