సీఈసీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఈసీ భన్వర్లాల్ నిర్ణయం హర్షణీయమని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వాస్తవానికి చంద్రబాబు ప్రాణాలతో ఉండకూడదనేది.. వైఎస్ జగన్ కోరిక అని ఆరోపణలు గుప్పించారు. విపక్షనేతగా జగన్ అనర్హుడని మరో మంత్రి ఆదినారయణరెడ్డి విమర్శించారు.జగన్ తీరుతో కడప జిల్లా పరువు పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, నిమ్మల కిష్టప్ప కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తే వారు పట్టించుకోలదని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. జగన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి కిందకు వస్తాయని పేర్కొంది. ఆయన చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని పేర్కొంది. తక్షణం జగన్ పై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.