పాక్ కొత్త నాటకాలకు తెరలేపింది: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
భారతీయుడు కులభూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ న్యాయస్థానం మరణశిక్షను విధించింది. అతను పాక్ లో గూఢచర్యానికి పాల్పడుతున్నాడని ఆరోపించింది. కూలభూషన్ భారత నేవీ మాజీ అధికారిగా ఉన్నారు. ఈ అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఈ విషయంపై ఆయన లోక్ సభలో మాట్లాడారు. పాకిస్థాన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
పాకిస్థాన్ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. భారత్ ను ఎదుర్కోలేక పాక్ ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జాదవ్ ను కాపాడేందుకు అంతర్జాతీయంగా మద్దతును కూడగట్టాలని ఆయన సూచించారు. ఇవాళ కులభూషణ్ యాదవ్ అంశం పార్లమెంటును కుదిపేసింది. ఈ విషయంలో విపక్షాలు అన్ని ఏకతాటిపైకి వచ్చాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.