ISIS ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఏటిఎస్..!
ముంబై ఎయిర్ పోర్ట్ లో అనుమానిత ఐఎస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటిఎస్) అధికారులు. దుబాయ్ నుండి భారత్ కు వచ్చిన అబు జియాద్ అనే వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాలను చేస్తున్నట్టు అనుమానం రాగా ముంబై ఏటీస్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు.. దుబాయ్ నుండి అబు జియాద్ నెట్ వర్క్ మెయింటైన్ చేస్తున్నాడని తెలిసుకున్నారు.
పశ్చిమ ఉత్తరప్రదేష్ లోని ముస్లీం యువతను రిక్రూట్ చేసుకునేందుకు అతను వచ్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఓ పక్క బిజునూర్ లో ఐఎస్ సపోర్టర్ అరెస్ట్ చేసి విచారిస్తున్న టైంలో అబు జియాద్ గురించి తెలిసిందని అందుకే అతని గురించి వెతుకుతుండగా ముంబై ఎయిర్ పోర్ట్ లో అతను దొరికాడని అంటున్నారు. ప్రస్తుతం అతని విచారణ వ్యవహారాలు బయటకు రావాల్సి ఉన్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.