టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంక్ లో టీమిండియా..!
టీమిండియా టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్లో టాప్ ప్లేస్కు చేరుకుంది. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో భారత జట్టుకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. 112 రేటింగ్ పాయింట్స్తో టీమిండియా వరల్డ్ ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది. అయితే ఇప్పటి వరకూ టాప్ ప్లేస్ లో ఉన్న ఆసీస్ 108 పాయిట్లతో మూడో స్థానానికి దిగజారింది. పాక్ 111 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
టీమిండియాకు ఫస్ట్ ప్లేస్ రావడానికి కారణం ఆసీస్ పరాజయమే. శ్రీలంకపై.. కంగారూలు 3-0 తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో అనూహ్యంగా ఆ జట్టు ర్యాకింగ్స్ లో కిందకు పడిపోయింది. ఇదిలాఉండగా విండీస్ టూర్ లో భారత్ రెండు మ్యాచ్ లను గెలిచింది. ఇది భారత్ కు కలిసివచ్చింది. ఇక.. శ్రీలంక-ఆసీస్ మధ్య జరిగిన థర్డ్ టెస్ట్ లో 163 పరుగుల తేడాతో లంకేయులు విజయం సాధించారు. దీంతో కంగారూలు ఏకంగా పది పాయింట్లు కోల్పోయారు. ర్యాకింగ్స్ లో నాలుగవ స్థానంలో ఇంగ్లాండ్, ఆరవ స్థానంలో శ్రీలంక, ఆఖరి స్థానంలో జింబాబ్వే ఉన్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.