సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు..
భారత ప్రధాని మోడీ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను కలిశారు. ఈ వ్యాఖ్యలు చేసింది.. ఎవరోకాదు సమాజ్ వాది పార్టీ నేత ఆజంఖాన్. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 25న ప్రధాని మోదీ పాకిస్తాన్ లో పర్యటించిన విషయం తెలి సిందే. పర్యటనలో భాగంగా.. ఆయన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిశారు. ఆ సమయంలో షరీఫ్ తో మోదీ వ్యక్తిగతంగా భేటీ అయ్యారని ఆజంఖాన్ అంటున్నారు. వీరి భేటీలో నవాజ్ షరీఫ్ తల్లి, కూతురు ఉన్నారని అంటున్నారు. అదే భేటీలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా ఉన్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. వీరి భేటీకి సంబంధించిన ఆధారాలు తనదగ్గర ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ నేతలు ఆజంఖాన్ పై మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. తక్షణం మంత్రి పదవి నుంచి ఆజంఖాన్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.