దేశవ్యప్తంగా పశువధపై నిషేధం విధించాలి: ఆజంఖాన్
యూపీ సీఎంగా వచ్చిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అక్రమ కబేలాలు మూయించేశారు. దీంతో ఎస్పీ నేత ఆజంఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఆవుల సహా పశువధపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు నిషేధం విధిస్తున్నారని ప్రశ్నించారు.
ఈ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉండాలని అన్నారు. అలాగే అక్రమ కబేళాలు ఉంటే మాత్రమే తప్పా? అని ప్రశ్నించారు. అదే లెసైన్స్ ఉన్న కబేళాల్లో అయితే ఈ పని తప్పలేదా అంటూ ప్రశ్నించారు. జైనులు సహా పలువురు మతస్తులు కోళ్లు, మేకలను కూడా చంపకూడదని అన్నారు. ముస్లింలు కూడా మాంసం తినడం ఆపేయాలని ఆయన అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.