బాబు మాట విన్న మోడీ!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ప్రధాని నరేంద్ర మోడీ ఆలకించారు. ఎప్పటి నుంచి బాబు చెబుతున్న మాటను మోడీ అమలు చేశారు. అంతేకాదు ఉన్నట్లుండి రూ.500లు, రూ.1000ల నోట్లు రద్దు చేస్తున్నామని ప్రకటించి బాబు పేల్చారు. ప్రధాని నిర్ణయంతో నల్లధనం పోగేసుకున్నవారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. తమ వద్ద కట్టలుకట్టలుగా ఉన్న లిక్విడ్ క్యాష్ ను ఏం చేయాలా అని తల పట్టుకుంటున్నారు. 500 – 1000 నోట్లను మార్చుకోవడానికి డిసెంబరు 30 వరకు ప్రధాని టైమిచ్చినా కూడా లెక్కల్లో చూపని ఆ డబ్బును వెనక్కి ఇవ్వలేక.. వృథాగా ఉంచుకోలేక ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. అంతేకాదు నల్లధనం – ఫేక్ కరెన్సీ సమస్యకు పరిష్కారంగా మోడీ తీసుకున్న ఈ నిర్ణయం అమల్లో భాగంగా క్యాష్ ట్రాంజక్షన్ ను ఆపడానికి ఇప్పటికే బయట ఉన్న ఆ నోట్లను వెనక్కి తెప్పించడానికి గాను రెండు రోజుల పాటు 9 – 10 తేదీల్లో దేశవ్యాప్తంగా ఏటీఎంలు పనిచేయకుండా చేస్తున్నారు. తొలుత ఈ మిషన్ అంతా పూర్తయిన తరువాత కొత్త 500 నోట్లు – 2000 నోట్లను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది.
కాగా రూ.500 – 1000 నోట్లను రద్దు చేసేలా ప్రధాని మోడీకి సిఫార్సు చేస్తానని కేంద్రం రూ.2000 నోట్లను తీసుకొస్తానని బాబు చెబుతుంటే చంద్రబాబుది అంతా పిచ్చితనం అనుకున్నారు. కానీ.. చంద్రబాబు నిజంగా ప్రధానికి చెప్పారా… చంద్రబాబు చెబితే ప్రధాని విన్నారా అన్నట్లుగా మోడీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి 500 – 1000 నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నల్లధనం నిరోధానికి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.