ప్రజా పోరాటాల వల్లే తెలంగాణ వచ్చింది: బండారు దత్తాత్రేయ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రజా పోరాటాల వల్లే వచ్చిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అంతేతప్ప ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల రాలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలుసుకోవాలని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని దిగ్విజయ్ సింగ్ అనడంపై ఆయన మండిపడ్డారు. డిగ్గీరాజావి అన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలు అని అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ కి 60 ఏళ్ళ సమయం పట్టిందని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని దిగ్విజయ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జన ఆవేదన సభ ఎంతమాత్రం కాదన్నారు. అది కేవలం కాంగ్రెస్ ఆవేదన సభ మాత్రమేనని అన్నారు. కేంద్ర సర్కారు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి, ఉగ్రవాదానికి అడ్డుకట్టపడిందని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.