అధికారులను దూషించే సంస్కృతి టీడీపీదే: భూమన కరుణాకర్ రెడ్డి
అధికారులను వైఎస్ జగన్ దూషించలేదని ఆ పార్టీ నేత భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అధికారులను దూషించే సంస్కృతి టీడీపీదేనని ఆరోపించారు. జగన్ పై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. తక్షణం జగన్ పై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఐఏఎస్ అధికారులు, సీనియర్ పోలీస్ అధికారులను బండ బూతులు తిట్టిన సంస్కృతి చంద్రబాబు నాయుడిది అని భూమన విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో వైసీపీ పోరాటాలు చేస్తోందన్నారు. అయితే ఏదో ఒక కారణం చూపి తమ నేత జగన్ పై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తమ నాయకుడిపై నిందలు మోపి, అబండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ నీతిబాహ్యమైన రాజకీయాలు మానుకోవాలన్నారు. జగన్ పై తప్పుడు కేసులు ఎత్తివేయాలని, లేని పక్షంలో వైసీపీ నిరంతర పోరాటాలు చేస్తూనే ఉంటుందని భూమన తేల్చి చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.