మహా కూటమి ఏర్పాటుపై సోనియాతో చర్చించిన నితీశ్ కుమార్..?
బీజేపీ హవాకు గండికొట్టడానికి విపక్ష పార్టీలు ప్రయత్నాలు ఆరంభించాయి. ఇందులో భాగంగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పావులు కదుపుతున్నారు. గతంలో బీహార్ ఎన్నికల్లో మహా కుటమిని ఏర్పాటు చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. అలాగే దేశంలో కూడా జాతీయ స్థాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయాలని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. దీనికోసం బీజేపీయేతర పార్టీలన్ని కలిసి రావాలని కూడా సూచించారు. ఇందులో భాగంగా ఆయన కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలిశారు.
గురువారం ఉదయం ఢిల్లీ వచ్చిన ఆయన సోనియా నివాసానికి వెళ్ళి ఆమెతో భేటీ అయ్యారు. బీజేపీని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాటు గురించి సోనియాతో చర్చించినట్లు సమాచారం. బీహార్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్డేడీ, కాంగ్రెస్ కలిసి మహా కూటమిగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత కూటమి తరపున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.దీన్ని ఉదాహరణగా చూపించి కూటమి ఏర్పాటుకు కలిసి రావాలని కోరినట్లుగా సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.