కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు చూపించండి: డాక్టర్ లక్ష్మణ్
సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర నిధులను పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ ఏమీ చేయని కేసీఆర్.. ఇప్పుడు మాటల గారడీ చేస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కారు కాంట్రాక్టర్ల లాభాల కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులు, సింగరేణి వారసత్వ ఉద్యోగాల వంటి సమస్యల సంగతి ఏమైందని ఆయన నిలదీశారు. సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడే తీరు సబబుగా లేదని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.