సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత మురళీధర్ రావు విమర్శలు..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చాలా అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. మోదీ కేవలం పేద ముస్లింల సమస్యలను పట్టించుకోవాలని మాత్రమే అన్నారని చెప్పారు. పేదలు అయిన ముస్లీంలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని చెప్పారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లీంలను కలుపుకుని పోవాలని చెప్పారని అన్నారు.
మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పటికీ వ్యతిరేకమేనని అన్నారు. రాజ్యాంగ పరంగా మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని స్పష్టం చేశారు. కేవలం ముస్లీంలకు వంద శాతం మేర రిజర్వేషన్లు, రెండు వందల శాతం అవకాశాలు కల్పిస్తామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ముస్లీం జనాభా 12 శాతం ఉందని అన్నారు. వారికి 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే వంద శాతం ఇచ్చినట్లేనని అన్నారు. ఈ నిర్ణయం వల్ల సమాజం నష్టపోతుందని అన్నారు. ఇలాంటి పనుల వల్ల వచ్చే రోజుల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.