టీఆర్ఎస్ పై బీజేపీ నేత నాగం ఫైర్
తెలంగాణలో వచ్చే ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ దే అధికారం అంటూ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఇరవై ఏళ్లు కాదు, ఇరవై నెలల పాటు తమ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ కాపాడుకుంటే చాలని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సెక్రటేరియట్ లో అపరిష్కృతంగా పేరుకుపోయిన ఫైళ్లను చూసి టీఆర్ఎస్ కు 20 ఏళ్ల పాటు అధికారం ఇవ్వాలా..? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
బినామీ ఆస్తులు కూడబెడుతున్న కేసీఆర్ ఫ్యామిలీకి జయలలితకు పట్టిన గతే పడుతుందని అన్నారు. రైతులను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని అన్నారు. టీఆర్ఎస్ అవినీతిపై బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి లేవనెత్తిన అవినీతి అంశాలపై మాట్లాడే ధైర్యం టీఆర్ఎస్ నాయకులకు ఉందా? అంటూ నాగం ప్రశ్నించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.