శివరాజ్ సింగ్ ఆధ్వర్యంలోనే మధ్య ప్రదేశ్ ఎన్నికలు ..
వచ్చే ఏడాది మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయనే దానిపై తర్జన భర్జనలు సాగాయి. దీంతో పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే అన్నింటికి జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెక్ పెట్టేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో జరుగుతాయని చెప్పారు.
ఈ మధ్యకాలంలో శివరాజ్ సింగ్ చౌహాన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం సాగింది. కాని ఆయన ఈ వార్తలను ఖండించారు. తాను మధ్యప్రదేశ్లోనే ఉంటానని స్పష్టం చేశారు. అలాగే 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేస్తానన్నారు. 2018లో కూడా బీజేపీ విజయం సాధిస్తే వరుసగా నాలుగుసార్లు మధ్యప్రదేశ్ అధికార పీఠానని దక్కించుకున్నట్లవుతుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.