ప్రస్తుత కేబినేట్ ఏ పార్టీదో చెప్పే పరిస్థితి లేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఏపీలో మంత్రి పదవులు ఆశించి వారు చాలామందే ఉన్నారు. కాని కొందరికే మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కింది. దీంతో ఆశావహుల్లో నిరాశ చెందారు. అంతేకాకుండా రాజీనామాల బాట పట్టారు. వారితో పాటు వారి అనుచరుల చేత కూడా రాజీనామాలు చేయిస్తున్నారు.వీరిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. బుజ్జగింపుల పర్వంలో భాగంగా ఆయన్ను మంత్రి చినరాజప్ప కలిశారు.ఆయనకు పలువిధాలుగా నచ్చచెప్పారు. తాను అన్ని విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.ఈ సందర్భంగా చినరాజప్ప విపక్ష నేత జగన్ పై మండిపడ్డారు.
ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ.. రాజకీయం వ్యాపారంగా మారిందని అన్నారు. దీంతో కార్యకర్తలు నలిగిపోతున్నారని అన్నారు. తాను పార్టీకి మంచి జరగాలనే మాట్లాడుతున్నానని అన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోవాలని అన్నారు. ఇప్పుడు ఉన్న కేబినేట్ ఏ పార్టీదో చెప్పే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.