నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎచ్చిన చంద్రబాబు గత కొన్ని రోజులుగా ఆయన తీరులో మార్పు కనిపిస్తోంది. మొన్న అసెంబ్లీలో కూడా పోలవరం 2018 నాటికి పూర్తి చేస్తామని, ఒకవేళ కేంద్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడతామంటే ఇవ్వడానికి తమకెలాంటి ఇబ్బంది లేదని చెప్పడం దగ్గరి నుంచి ఈ రోజు వరకు చూస్తే బాబు స్వరంలో కూడా మార్పు వచ్చింది. తాజాగా గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన తీరును చూస్తే అది స్పష్టంగా తెలుస్తుంది.గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటించారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కొత్త రాష్ట్రమైనా కేంద్రం నుంచి ఆశించిన సహకారం అందడం లేదని అయినా మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కరువును ఎదుర్కునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీటి పరిరక్షణ… ఉద్యమంగా సాగాలన్న సీఎం ప్రతీ ఇంట్లో ఇంకుడుగుంతలు, పొలాల్లో పంటకుంటలు తవ్వుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో నదుల అనుసంధానం చేసిన ఘనత తమదే అని చంద్రబాబు వివరించారు. కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కు నిన్న కేంద్ర మంత్రులు అపాయింట్ ఇవ్వడంపై బాబు అసంతృఫ్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికై మంత్రులు, ఎంపీలు కూడా స్పందించారు. కేంద్రం అలా చేయడం పద్ధతిగా లేదని బహిరంగంగానే అంటుంటుడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.