భారత్ పై డ్రాగన్ కంట్రీ మరోసారి ఆరోపణలు..
భారత్ పై డ్రాగన్ కంట్రీ మరోసారి తన కుళ్లుబుద్ధి బయటపెట్టుకుంది. దలైలామాను అడ్డుపెట్టుకుని భారత్ చైనా ప్రయోజనాలకు గండికొడుతోందని ఆరోపించింది. అరుణాచల్ ప్రదేశ్ లో దలైలామా పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయని పేర్కొంది. ఆ ప్రాంతంలో దలైలామా పర్యటన చాలా ప్రభావం చూపించిందని చెప్పింది. టిబెట్ పై తమ దేశ విధానాన్ని భారత్ గౌరవించాలని సూచించింది.
చైనాను అంతర్జాతీయ సమాజం ముందు చిన్నబుచ్చేలా భారత్ చర్యలు ఉన్నాయని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ అంటూ చైనా వాదిస్తోంది. టిబెట్ లో అరుణాచల్ ప్రదేశ్ ఓ భాగని చెప్పుకొస్తోంది. ఈ కారణంగా దలైలామా పర్యటనపై హెచ్చరికలు జారీ చేసింది. అయితే చైనా ఎన్ని హెచ్చరికలు చేసినా భారత్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.చైనా హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.