మణిపూర్ అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గిన సీఎం బీరేన్ సింగ్..
మణిపూర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. రెండవ స్థానంలో బీజేపీ నిలిచింది. మొత్తం 60 స్థానాలు ఉన్న మణిపూర్ లో కాంగ్రెస్ కు 28 స్థానాలు దక్కాయి. ఇక బీజేపీ 21 స్థానాలు మాత్రమే సాధించింది. వాస్తవానికి బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ గాని బీజేపీ గాని మేజిక్ ఫిగర్ ని సాధించలేకపోయాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
ఇక బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చాకచక్యంగా పావులు కదపడంతో మణిపూర్ లో బీజేపీకి ఇతర పార్టీలు, స్వతంత్రులు మద్దతు ప్రకటించారు. దీంతో అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆయన తాజాగా బలపరీక్షలో నెగ్గారు. బీరేన్ సింగ్ కు అసెంబ్లీలో మొత్తం 33 మంది శాసన సభ్యులు మద్దతు ప్రకటించారు.దీంతో బీజేపీ సర్కారుకు ఎలాంటి ఢోకా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.