సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి: వైసీపీ ఎస్సీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దళిత వ్యతిరేకి అని వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఆయన పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే అనిత చేసే వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యల్లో అర్ధం లేదని అన్నారు.
అనిత వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అనిత మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దళితులపై దృష్టిపెట్టాలని సూచించారు. వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. లేదంటే దళిత వ్యతిరేకిగా మారుతారని ఆరోపించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.