సైకిల్ మీద ఆఫీసుకెళ్ళిన సీఎం చంద్రబాబు
టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సైకిల్ నడిపారు. ఆయన సెక్రటేరియట్ లోని రెండవ బ్లాక్ నుంచి తన ఆఫీసు వరకు సైకిల్ మీద వెళ్ళారు. పొల్యూషన్ తగ్గించేందుకు స్మార్ట్ సైకిళ్ళ వ్యవస్థను అమరావతిలో ఆరంభించారు. ఈ నేపథ్యంలో జర్మనీ నుంచి 30 సైకిళ్లు ఏపీ రాజధానికి చేరాయి. వెలగపూడిలోని సెక్రటేరియట్ లో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం సైకిళ్ళ కోసం ప్రత్యేకంగా రహదారిని ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ లోపల రెండు స్మార్ట్ సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ వద్ద మరో సైకిల్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ప్రతి స్టేషన్ లో 10 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. సైకిల్ తీసుకునే వారికి ప్రత్యేకంగా పాస్ వర్డ్, స్వైపింగ్ కార్డును కేటాయిస్తారు. ఈ పాస్ వర్డ్ ద్వారా మాత్రమే సైకిళ్లు ఓపెన్ అవుతాయి. పని పూర్తయిన తర్వాత ఈ మూడు స్టేషన్లలో ఎక్కడైనా సైకిళ్లను ఇచ్చివేయవచ్చు. అల్యూమినియం, ఎల్లాయిడ్ తో తయారు చేయబడిన ఈ సైకిళ్లు వర్షంలో తడిసినా కూడా పాడయ్యే అవకాశం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.