గృహ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన.. కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్..
రాజ్భవన్ ఉద్యోగుల గృహ నిర్మాణాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని రాజ్భవన్ను అనుకుని ఉన్న స్థలంలో కొత్త నివాసాల కోసం నిర్మాణాలను చేపడు తున్నారు. రాజ్భవన్లో పనిచేసే ఉద్యోగుల నివాసానికి 185 ప్లాట్ల ను నిర్మించనున్నారు.దీంతో పాటు 500 మంది విద్యార్థులు చదువు కునేందుకు వీలుగా స్కూల్ నిర్మాణాన్ని కూడా చేయనున్నారు. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఓ కమ్యూనిటీ హాలును ఏర్పాటు చేయనున్నారు.
అలాగే పోలీసు, ఇతర భద్రతా సిబ్బంది కోసం బ్యారక్లను కూడా నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల కోసం సర్కారు 95.50 కోట్లను ఖర్చు చేయనుంది. ముందుగా 87 కోట్లను సర్కారు మంజూరు చేసింది. 2017 సెప్టెంబరు నాటికి భవన నిర్మాణాలు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్రావు, జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.