తెలంగాణలో దద్దమ్మ పాలన: తమ్మినేని వీరభద్రం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరోసారి విమర్శలు చేశారు. రాష్ట్రంలో దద్దమ్మ పాలన సాగుతోందని విమర్శించారు. సీపీఎం మహాజన పాదయాత్ర సందర్భంగా ఆయన నల్గొండ జిల్లా వేముల పల్లి, మిర్యాలగూడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై తాము ప్రజలను చైతన్యవంతం చేస్తామని చెప్పారు. దీనికోసం పొలికేక పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. మార్చి 19న హైదరాబాద్ లో ఈ సభను నిర్వహిస్తామని చెప్పారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. వాటికి కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కేరళ ముఖ్యమంత్రి తలకి వెల కట్టిన ఆర్ఎస్ఎస్ నేతను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని అన్నారు. రైసు మిల్లులను ఆదుకుని వేలాది మంది ఉపాధిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎంకు లేఖ రాశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.