దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సీఎం యోగి
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆయన 102 మంది దళితులతో కలిసి భోజనం ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన గోరఖ్ పూర్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత స్థానిక దళితులతో కలిసి భోజనం చేశారు. ఇలాగే గత నెలలో ఓ దళిత గ్రామంలో సీఎం యోగి పర్యటించారు.
అప్పుడు సీఎం వస్తున్న సమయంలో అధికారులు నానా హంగామా చేశారు. స్థానికులకు సబ్బులు, షాంపులు ఇచ్చి స్నానం చేసి రమ్మన్నారు.ముఖ్యమంత్రి కార్యక్రమానికి పరిశుభ్రంగా రావాలని అధికారులు సూచించారు. ఇదికాస్తా వివాదాస్పదమైంది.దీంతో సీఎం యోగి ఆదిత్యనాధ్ సొంత నియోజకవర్గంలోని దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అన్నింటికంటే ముందు యోగి ఆదిత్యానాథ్ గోరఖ్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.