కోమటిరెడ్డిది అవగాహన రాహిత్యం: పొన్నాల లక్ష్మయ్య..
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అవుతారని కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. కోమటిరెడ్డిది అవగాహన రాహిత్యమని అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్ధులే తమ నేతను ఎన్నుకుంటారని అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమని చెప్పారు.
కోమటిరెడ్డి సోదరుల వ్యవహార శైలిలో ఆయన మండిపడ్డారు. ఈ సోదరుల వ్యవహార తీరు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ పరిశీలిస్తోందని అన్నారు. ఈ సారి ఖచ్చితంగా దిద్దుబాటు చర్యలు ఉంటాయని ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెనుక దిగ్విజయ్ సింగ్ బాసటగా ఉన్నారన్నది అవాస్తవం అని అన్నారు. ఇప్పటికైనా కోమటిరెడ్డి సోదరులు తమ తీరు మార్చుకోవాలని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.