కాంగ్రెస్ ఎంపీకి సుప్రీంలో చుక్కెదురు..!
కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌధురి పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతోపాటు మర్యాదగా ప్రవర్తించాలంటూ సూచించింది. తనను అధికార నివాసం నుంచి బయటకు పంపించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. అయితే పిటిషన్ ను కోర్టు శుక్రవారం తిరస్కరించింది.
అసలు ఏం జరిగింది..?
పశ్చిమ్బంగాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురి కొంత కాలంగా ఢిల్లీలోని న్యూ మోతీబాగ్ హౌస్లో ఉంటున్నారు. అయితే గడువు ముగియడంతో నివాసాన్ని ఖాళీ చేయాలని కేంద్రం తెలియజేసింది. కాని దీనిపై రంజన్ చౌధురి ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రంజన్ పిటిషన్ను కొట్టివేయడంతో పాటు.. ఇంటిని ఖాళీ చేయాలని సూచించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పోలీసుల సాయంతో ఆయన్ను ఇంటి నుంచి పంపివేసింది.తర్వాత ఆయన.. తనకు ప్రభుత్వ నివాసంలో ఉండేలా అవకాశం ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించారు. అయినా మళ్లీ చుక్కెదురైంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.