సామాజిక తెలంగాణతోనే అభివృద్ధి: తమ్మినేని వీరభద్రం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. మాయమాటలు మానుకోవాలని సూచించారు. సత్వరం సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని అన్నారు.ఆ పార్టీ చేపట్టిన మహాజన పాదయాత్రలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. యురేనియం ప్రాజెక్టుకు తమ పార్టీ వ్యతిరేకమని తేల్చి చెప్పారు.
సమాజంలో 93 శాతం మేర ఉన్న ప్రజలను కాదని కేవలం ఏడు శాతం ఉన్న అగ్రవర్ణాల చేతిలో పాలన ఉండటం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.9800కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించిందని అన్నారు. వీటిలో రూ.7800 కోట్ల మేర మిషన్ భగీరథ కోసం కాంట్రాక్టర్లకు ఇచ్చారని అన్నారు.కేసీఆర్ సర్కారు పాలనాపరంగా ప్రజలను మోసం చేస్తోంది ఆరోపించారు. తమ పార్టీ ప్రజలను చైతన్యవంతం చేస్తోందన్నారు. అలాగే అన్ని పార్టీలను భాగస్వాయ్యం చేస్తోందన్నారు. అందరికి న్యాయం జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా స్థానికులు తమ్మినేనికి గొర్రెపిల్లను బహుకరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.