వందేమాతరం అంటే తప్పేంటి: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు
వందేమాతరం అంటే మాతకు వందనం అని అర్ధం అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.దాన్ని పలకడానికి అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఓటుబ్యాంకు రాజకీయాలతో మనల్ని మనమే చులకన చేసుకోవడం అలవాటుగా మారిందని అన్నారు. దేశంలో స్వేచ్ఛ ఉందని ఏదైనా మాట్లాడతామంటే మాత్రం సరికాదన్నారు. డా.ఎస్.రాఘవేంద్రరావు రచించిన ప్రవాస భారతి గంథాన్ని హైదరాబాద్లోని తెలుగు యూనివర్శిటీలో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతీయ జీవన విధానం ఎంతో గొప్పదని తెలిపారు. కొందరు హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. అది అసలు మంచి పద్ధతి కాదన్నారు. మూలాలు మరచిన వ్యక్తులు అసలు ముందుకు వెళ్ళలేరని అన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పదని తెలిపారు. మన సంస్కృతిని ఎన్నో దేశాలు గౌరవిస్తున్నాయన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.