సీఆర్ఫీఎఫ్ కమాండిగ్ అధికారి చేతా నిజమైన హీరో.. ట్విట్టర్ లో స్పందించిన సెహ్వాగ్..
ఉగ్రవాదులతో పోరాటం సందర్భంగా సీఆర్ఫీఎఫ్ కమాండిగ్ అధికారి చేతన్ కుమార్ చేతా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే కోమాలోకి వెళ్లిన ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆయన కోలుకుని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కోలుకోవడంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేశ రక్షణ కోసం తన రక్తం ధారపోసిన చేతా కోసం భారతీయులు చేసిన ప్రార్ధనలు ఫలించాయని అన్నారు. చేతా నిజమైన హీరో అని అన్నారు.
రెండు నెలల క్రితం బందిపొరలో భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.అలాగే ముగ్గురు సైనికులు మృతి చెందారు. సీఆర్ఫీఎఫ్ కమాండింగ్ అధికారి చేతన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స అందించారు. చేతా కంటిలో తూటా, శరీరంలో మరో 8తూటాలతో విషమ పరిస్థితిలో ఉండగా ఆస్పత్రికి తరలించారు. అయితే తూటాలను తొలగించిన తర్వాత కోమాలోకి వెళ్ళారు. అయితే తక్కువ సమయంలో ఆయన కోలుకోవడంతో డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.