వేద నిలయం మా ఆస్తి.. స్మారకంగా మార్చే హక్కు ఎవరికి లేదు: దీపా జయకుమార్
అన్నాడీఎంకే ఇరు వర్గాల విలీనంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పన్నీరు వర్గం డిమాండ్ మేరకు దివంగత సీఎం జయలలిత మృతిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా పళనీస్వామి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అలాగే పోయెస్ గార్డెన్ లోని జయ నివాసాన్ని స్మారకంగా మారుస్తామని పళనీస్వామి తెలిపారు. ఈ విషయంపై జయలలిత మేనకోడలు దీప స్పందించారు.
పోయెస్ గార్డెన్లోని జయలలిత నివాసాన్ని స్మారకంగా మార్చే అధికారం పళనిస్వామికి లేదన్నారు. అది తమ వారసత్వ ఆస్తి అని అన్నారు. పళనిస్వామి తన పదవిని కాపాడుకునేందుకే విచారణ కమిటీ వేశారని అన్నారు. తాము పోయెస్ గార్డెన్ లోని ఆ నివాసాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునేది లేదన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.