రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ చరిత్ర సృష్టించారు..!
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫైటర్ జెట్ సూఖోయ్-30 ఎంకేఐలో విహరించి కొత్త రికార్డు సృష్టించారు. బుధవారం ఆమె జీ-సూట్ ధరించి, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానంలో 45 నిమిషాల పాటు ప్రయాణించారు. భారత వైమానిక దళం పోరాట సామర్థ్యాన్ని సమీక్షించారు. యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా నిలిచారు. ఈ యుద్ధ విమానంలో రెండు సీట్లు, రెండు ఇంజిన్లు ఉంటాయి. దీనిని మన దేశంలోనే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఇది అణ్వాయుధ సామర్థ్యంగల విమానం.
శత్రు దేశ భూభాగంలోకి భీకరంగా చొచ్చుకెళ్ళగలిగే సామర్థ్యం దీనికి ఉంది. గతంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సుఖోయ్-30 యుద్ధ విమానంలో ప్రయాణించారు. గగన విహారాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం నిర్మల సీతారామన్ మాట్లాడుతూ యుద్ధ విమానంలో ప్రయాణించడం వల్ల తనకు చాలా విషయాలు తెలిశాయన్నారు. రక్షణ సిబ్బంది ఎంత కఠోర శిక్షణ చేస్తారో తనకు తెలిసిందన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.