చంద్రబాబు మూడేళ్ళ పాలనలో అభివృద్ధి శూన్యం: వైసీపీ ఎంపీలు
సీఎం చంద్రబాబు మూడేళ్లపాలనలో అభివృద్ధి శూన్యమని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు విమర్శించారు. టీడీపీ సర్కారు ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని అన్నారు. కేవలం స్వలాభం చూసుకుంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అలా అయితే జగన్ సీఎం చేయవచ్చని అన్నారు.
ఈ మేరకు వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కావలిలో వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంపీలు వైవీసుబ్బారెడ్డి, మేకపాటి, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.ఈ ప్లీనరీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.