రాహుల్ పై సంచలన ఆరోపణలు చేసిన దిగ్విజయ్ సింగ్..
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంకిత భావంతో, దృఢ నిశ్చయంతో పనిచేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. రాహుల్ సరిగా పనిచేయడం లేదని అన్నారు. ఈ విషయాన్ని చాలాసార్లు ఆయనకు చెప్పానని కూడా అన్నారు. మళ్ళీ అదే విషయం చెబుతున్నానని అన్నారు. కాలం మారిందని దానికి తగ్గట్లుగా కాంగ్రెస్ ను ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రెజెంట్ తమకు కొత్త కాంగ్రెస్, కొత్త ప్రణాళిక, కొత్త మార్గ సూచిక, వినూత్నమైన ప్రచార శైలి అవసరం అన్నారు. మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. దీన్ని పార్టీ హై కమాండే చేయాలని సూచించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేయాలని అన్నారు. గోవా ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని విషయం తెలిసిందే. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దిగ్విజయ్ సింగ్ పై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.