టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం: దిగ్విజయ్ సింగ్
టీఆర్ఎస్ సర్కారుపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని వెల్లడించారు. నేటి నుంచి ఈనెల 28 వరకు జన ఆవేదన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికోసం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు.
ఈ సందర్భంగా ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం జన ఆవేదన సభలను ప్రారంభించేందుకు వెళ్ళారు. అలాగే పార్టీ నేతల్లో నెలకొన్న అంతర్గత స్పర్థలను పరిష్కరించనున్నారు. దీనికోసం పార్టీ నేలలు అందరితో భేటీ కానున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.