భయంతో కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు: డీకే అరుణ
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత డీకే. అరుణ అన్నారు. శుక్రవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు. ప్రజల ధనంతో మొక్కులు తీర్చుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. కేసీఆర్ మాత్రమే అసలైన సన్నాసి అని విమర్శించారు.
శుక్రవారం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలను సన్నాసులు అంటూ విమర్శించారు. దేవుడి మొక్కులపై రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. గ్రీన్ ట్రిబ్యునల్ అని, కోర్టులో కేసులు వేసి మరీ పలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు చేసే పనులను నిలదీస్తామని చెప్పారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని వాటి సాయంతోనే నిలదీస్తామన్నారు. మరో 40 ఏళ్ళు అవకాశం ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమీ ఉండదని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.