ఆర్ కె నగర్ లో గెలుపు మాదే: ఎంకె స్టాలిన్
ఆర్కే నగర్ బై పోల్ లో డీఎంకే విజయం కేతనం ఎగురవేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ జోస్యం చెప్పారు. ఈసీ అన్నాడీఎంకేను స్తంభింపచేయడంతో తమకు మరింత సులువుగా విజయం వరిస్తుందని అన్నారు. జయ లలిత మరణంతో ఆర్ కె నగర్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇదిలాఉంటే అన్నాడీఎంకే పార్టీ గురించి పన్నీరు వర్గం, శశికళ వర్గం తమది అంటే తమది అని ఈసీని ఆశ్రయించాయి.
తాము అధికారంలో ఉన్నాం కాబట్టి తమకే అన్నాడీఎంకే చెందాలని శశికళ వర్గం వాదించింది. ఇక కార్యకర్తల బలం తమకే ఉందని పన్నీరు వర్గం తెలిపింది. దీంతో ఈసీ అన్నాడీఎంకే పేరును గాని, రెండాకుల గుర్తును గాని ఎవరికి కేటాయించలేదు. పార్టీ పేరును ఏకంగా స్తంభింపచేసింది.
పార్టీ రెండాకుల గుర్తును కూడా ఏ వర్గానికి కేటాయించలేదు. సరికదా అన్నాడీఎంకే పేరును కూడా ఎవరూ వాడరాదని సూచించింది. అయితే కొత్త పేర్లు సూచించవచ్చని తెలిపింది. దీంతో పన్నీరు వర్గం అన్నాడీఎంకే పురచ్చితలైవి అమ్మా అని ప్రతిపాదించారు. ఇక శశికళ వర్గం అన్నాడీఎంకే అమ్మా అని ప్రతిపాదించారు. దీనికి ఈసీ ఆమోదం తెలిపింది. అలాగే గుర్తులను కూడా కోరింది. ఇరువురు తమకు కావాల్సిన గుర్తులను తెలిపారు. చివరకు శశికళ వర్గానికి టోపీ గుర్తును కేటాయించింది. పన్నీరు వర్గానికి విద్యుత్ స్తంభం గుర్తును కేటాయించింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.