ఏపీలో ఉన్నామా ఆఫ్ఘన్ లో ఉన్నామా అర్ధం కావడం లేదు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఫలితాలు విడుదలైన తర్వాత వైఎస్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలను భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇక వైసీపీపై టీడీపీ నేతలు కూడా ఎదురు దాడి చేశారు. జగన్ సొంత బాబాయినే గెలిపించుకోలేకపోయారని అన్నారు. ప్రజలు జగన్ ను నమ్మడం లేదని విమర్శించారు.
ఇక ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీపై ఆరోపణలు గుప్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని మరీ కిడ్నాప్ లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల కోసం కోట్ల రూపాయిలు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే ఏపీలో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా అన్న సందేహం కలుగుతోందని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.