నితీష్ కే జెడి(యూ): ఈసీ
ఆధిపర్య పోరులో ఫైనల్ గా బిహార్ సిఎం నితీష్ కుమార్ విజయం సాధించారు. కొద్దిరోజులుగా పార్టీతో పాటుగా బాణం గుర్తుకు సంబందించిన గొడవల గురించి తెలిసిందే. ఇక దీనికి ఫైనల్ గా ఎన్నికల కమీషన్ నితీష్ కే పార్టీతో పాటుగా బాణం గుర్తు దక్కుతాయని తేల్చి చెప్పేసింది. జెడి(యూ) పార్టీలోని మెజారిటీ సభ్యులు.. జాతీయ కౌన్సిల్ నితీష్ కే మద్ధుతు తెలిపినట్టు పేర్కొంది. ఇక మరో పక్క పార్టీని గుర్తుని తమకే కేటాయించాలని చేసిన శరద్ యాదవ్ వర్గం చేసిన పిటీషన్ ఈసీ తిరస్కరించింది.
ఆర్జ్డైడితో తెగదెంపులు.. బిజెపి మద్ధు విషయంలో నేతల మధ్య విభేధాలతో పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. జెడి(యూ) అధ్యక్షునిగా సీనియర్ నేత చోటు భాయ్ అమర్సాంగ్ శరద్ ను నియమిచారు. ఇక పార్టీ, గుర్తు ఈసీ వివరణ కోరగా నితీష్ కుమార్ కే దక్కుతాయని వెళ్లడించింది. ఈసీ క్లియరెన్స్ తో నితీష్ తరపున వర్గం సంతోష వాతావరణం కనబడుతుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.